కొత్త పార్టీ పెడతాం… బీజేపీని గద్దె దించుతాం
— ప్రధాని మోదీపై కేసీఆర్ ఆరోపణలు
మీటర్లు, విద్యుత్ సంస్కరణలు.. విరాళాలిచ్చేది కార్పోరేట్ల కోసమే
మోదీ పాలన అవినీతి కంపు..
రాఫెల్ డీల్లో కుంభకోణం, సుప్రీం కోర్టుకెక్కుతాం
కాంగ్రెస్కు మద్ధతివ్వను.. హిమంతను అంత తేలిగ్గా వదలను
బీజేపీకి కేసీఆర్ అల్టీమేటం
ఢిల్లీలో ‘‘కీ’’ రోల్ నాదే..
త్వరలోనే మమత, ఉద్ధవ్లతో భేటీ
జాతీయ రాజకీయాలపై కేసీఆర్
రాహుల్ను ఉద్ధేశించి అసోం సీఎం అన్న వ్యాఖ్యలన్ని తాను తేలిగ్గా వదిలేయనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి మోదీని పిలవాలో లేదో ఆలోచిస్తామన్నారు. దళిత సంఘాలకు , రాజ్యాంగానికి సంబంధం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరిహద్దుల్లో డ్రామాలు చేస్తారని.. ఈ తరహా రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలని కేసీఆర్ హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వంలో గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని సీఎం ఆరోపించారు. తాను కాంగ్రెస్కు మద్ధతివ్వడం లేదని, రాహుల్ గాంధీ విషయం మాట్లాడానని కేసీఆర్ స్పష్టం చేశారు. దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం, ఆడపిల్లలకు ఆస్తిలో సమానహక్కు కోసం కొత్త రాజ్యాంగం రాయాలని సీఎం డిమాండ్ చేశారు. యూపీ ఎన్నికల పోలింగ్ మరుసటి రోజే పెట్రోల్ ధరలు పెరుగుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని.. దీనిని అరికట్టడానికి కొత్త రాజ్యాంగం రాయాలన్నారు. దేశమంతా దళితబంధు పెట్టాలని.. దీని కోసం రాజ్యాంగం రాయాలంటున్నానని, దళిత సంఘాలు వద్దంటాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. అమెరికా కన్నా గొప్ప ఆర్ధికశక్తిగా ఎదిగేందుకు కొత్త చట్టం , కొత్త స్పూర్తి రావాలన్నారు. తెలంగాణలాగా భారతదేశం కూడా మారడానికి కొత్త రాజ్యాంగం రావాలంటున్నానని సీఎం చెప్పారు.
దేశం కోసం కొత్త పార్టీ పెట్టాలని అందరూ కోరుకుంటే తప్పకుండా పెడదామని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఫ్రంట్లు కాదు.. ప్రజలే ఫ్రంట్గా ఏర్పడాలని సీఎం పిలుపునిచ్చారు. ఉద్ధవ్ థాక్రేతో చర్చించేందుకు త్వరలోనే ముంబైకి వెళ్తానని కేసీఆర్ తెలిపారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేశారని.. త్వరలో కోల్కతాకు కూడా వెళ్తానని ఆయన పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో తప్పకుండా ప్రధాన పాత్ర నాదే వుంటుందని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా అన్ని పార్టీలు ఐక్యం కావాలని.. అందరం కలిసి బీజేపీని ఇంటికి పంపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మాపై కూడా విచారణ జరగాలని.. అప్పుడే ఎవరేంటో తెలుస్తుందని, పవిత్రంగా ఎవరున్నారో తెలుస్తుందని సీఎం అన్నారు. మనకు పార్టీ పెట్టే దమ్ము లేదా అని కేసీఆర్ పిలుపునిచ్చారు. మోదీకి స్వాగతం పలికేందుకు తాను వెళ్లలేదని ఎవరెవరో ఏమేమో మాట్లాడారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్వరం కారణంగానే తాను మోదీకి స్వాగతం పలికేందుకు వెళ్లలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్పై రాహుల్ గాంధీ సాక్ష్యాలు అడగడంలో తప్పు లేదని.. తాను కూడా అడుగుతున్నానని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేతగా, ఎంపీగా అడిగే హక్కు రాహుల్ గాంధీకి వుందని కేసీఆర్ స్పష్టం చేశారు. దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం, ఆడపిల్లలకు ఆస్తిలో సమానహక్కు కోసం కొత్త రాజ్యాంగం రాయాలని సీఎం డిమాండ్ చేశారు. యూపీ ఎన్నికల పోలింగ్ మరుసటి రోజే పెట్రోల్ ధరలు పెరుగుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని.. దీనిని అరికట్టడానికి కొత్త రాజ్యాంగం రాయాలన్నారు. దేశమంతా దళితబంధు పెట్టాలని.. దీని కోసం రాజ్యాంగం రాయాలంటున్నానని, దళిత సంఘాలు వద్దంటాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. అమెరికా కన్నా గొప్ప ఆర్ధికశక్తిగా ఎదిగేందుకు కొత్త చట్టం , కొత్త స్పూర్తి రావాలన్నారు. తెలంగాణలాగా భారతదేశం కూడా మారడానికి కొత్త రాజ్యాంగం రావాలంటున్నానని సీఎం చెప్పారు.